పదకొండేళ్ల తర్వాత ఆర్టీసీ విశ్రాంత కార్మికులకు సకల జనుల సమ్మె వేతనం
- మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ చర్చ
- శనివారం నిధులు విడుదల చేస్తూ ఆర్టీసీ చైర్మన్ ఉత్తర్వులు
- విశ్రాంత ఉద్యోగుల ఖాతాల్లో త్వరలో జమ
సకల జనుల సమ్మె కాలపు వేతనం అందుకోకుండానే 8,053 మంది కార్మికులు పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సమ్మె కాలపు వేతనం కోసం పోరాడుతూనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగ నేతలతో మంత్రులు జరిపిన భేటీలో ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. మంత్రులు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా నిర్ణయం వెలువడింది.
పదకొండేళ్ల పోరాటం తర్వాత వారి నిరీక్షణకు తెరపడింది. కార్మికులకు 3 డీఏలతో పాటు పదవీ విరమణ పొందిన కార్మికులకు సమ్మె కాలపు వేతనాన్ని విడుదల చేస్తూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. ఇందుకోసం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.