Telangana: కేటీఆర్ నడిపిన బైక్ 29 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు... ఇదిగో ఫొటో!

  • 1994లో నిజాం కాలేజీలో విద్యార్థిగా కేటీఆర్
  • కేటీఆర్ నాడు వాడిన సుజుకీ బైక్ ను పోస్ట్ చేసిన జాన్సన్
  • 24 ఏళ్లుగా ఇదే బైక్ ను వాడుతున్నట్లుగా చెప్పిన వైనం
  • జాన్సన్ పోస్ట్ చూసి అమితాశ్చర్యానికి గురైన కేటీఆర్
Johnson a Nizam college old students posts ktr old bike suzuki samurai and says stilll it is running

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్... శనివారం రాత్రి ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కళాశాలలో తాను నడిపిన బైక్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని, 29 ఏళ్లు గడిచినా ఆ బైక్ ఇంకా మంచి కండిషన్ లోనే ఉందంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదిగో ఆ ఫొటోలో కనిపిస్తున్నది నా బైకేనంటూ ఆయన సంబరపడిపోయారు. అంతేకాకుండా తన పాత బైక్ ను గుర్తు చేస్తూ మధుర స్మృతులను గుర్తు చేశారంటూ జాన్సన్ అనే వ్యక్తికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఈ బైక్ నడిపిన రీతిలో ఇప్పుడు కూడా కేటీఆర్ తో కలిసి బైక్ పై తిరగాలని ఉందంటూ జాన్సన్ తన పోస్టులో తెలిపాడు. ఈ పోస్ట్ ను చూసినంతనే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు. ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఆ బైక్ నే నాడు వాడారు. నాడు కేటీఆర్ నుంచి తీసుకున్న ఆ బైక్ ను జాన్సన్ ఇప్పటికీ వాడుతుండటం నిజంగా ఆశ్చర్యకరమే.

More Telugu News