Sirish: 'ఏంటి బాబూ .. మాట్లాడితే ముంబై వెళ్లొస్తున్నావ్?' : శిరీష్ ను ఆటపట్టించిన అలీ

  • విభిన్న ప్రేమకథా చిత్రంగా రానున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • అల్లు శిరీష్ జోడీకట్టిన అనూ ఇమ్మాన్యుయేల్ 
  • ఈ నెల 4వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
Allu Sirish Interview

అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 వారు సమర్పిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అల్లు శిరీష్ పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన 'ప్రోమో' ఇప్పుడు రన్ అవుతోంది. 

"ఏంటి ఈ మధ్య ముంబైకి చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నావ్ .. కోడలిని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నావా?" అంటూ అలీ అడగడంతో శిరీష్ నవ్వేశాడు. ఈ సినిమాలో శిరీష్ - అనూ మధ్య లిఫ్టులో లిప్ కిస్ సీన్ ఒకటి ఉంది. ట్రైలర్ లో దానినినే ఎక్కువగా హైలైట్ చేశారు. అందుకు సంబంధించి ఎక్కడి లిఫ్టును వాడారు? ఎన్ని టేకులు తీసుకున్నావు" అంటూ అలీ ఆటపట్టించాడు. ఆ సీన్ చూసి అందరూ తనని ఏడిపిస్తున్నారని శిరీష్ అన్నాడు. 

"బన్నీ తన వైఫ్ కి చెప్పకూడని సీక్రెట్స్ కూడా నిన్ను పిలిచి నీకు చెబుతాడట ఏంటి?" అంటూ అలీ అడిగాడు. అలాగే మీ ముగ్గురు అన్నదమ్ములలో కోపిష్టి ఎవరు? అని అడిగాడు. ఈ రెండూ కూడా ఆసక్తిని రేకెత్తించే ప్రశ్నలే. అందుకు శిరీష్ ఏమని చెప్పాడనేది పూర్తి ఎపిసోడ్ చూస్తేనే గాని తెలియదు. పూర్తి ఎపిసోడ్ వచ్చేవారం ప్రసారం కానుంది.

More Telugu News