'టీ20 ప్రపంచ కప్' లో కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు
- రికార్డుకు ఇంకో 28రుగులు దూరంలో కోహ్లీ
- ఈ టోర్నీ చరిత్రలో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలవనున్న మాజీ సారథి
- ఇప్పటిదాకా 989 పరుగులు చేసిన భారత స్టార్ బ్యాటర్
- 1016 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న మహేల జయవర్ధనే
ఇప్పటిదాకా జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ టోర్నీలలో కలిపి విరాట్ 989 పరుగులు చేశాడు. మరో 28 రన్స్ చేస్తే ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు బద్దలు కొడతాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (1016 పరుగులు) పేరిట ఈ రికార్డు ఉంది.
దక్షిణాఫ్రికాపై 11 పరుగులు చేస్తే కోహ్లీ టీ20 ప్రపంచ కప్ లో వెయ్యి పరుగుల క్లబ్ లో చేరతాడు. 28 పరుగులు చేస్తే టోర్నీలో హయ్యెస్ట్ స్కోరర్ గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మ్యాచ్ లోనే అతను ఈ రికార్డు అందుకుంటాడో లేదో చూడాలి.
కాగా, టీ20 ప్రపంచ కప్ అనగానే కోహ్లీ విజృంభిస్తున్నాడు. గతంలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా ఈ వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటిదాకా ఆడిన 23 మ్యాచ్ ల్లో అతను 12 అర్ధ సెంచరీలు సాధించి, 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు.