Telugu People: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు తెలుగు వ్యక్తుల దుర్మరణం

  • షెఫీల్డ్ ఏరియాలో దుర్ఘటన
  • పికప్ ట్రక్, మినీ వ్యాన్ ఢీ
  • మృతులు న్యూ హావెన్ కు చెందినవారు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Four Telugu peopl died in a road accident in USA

అమెరికా తెలుగు సమాజంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు తెలుగు వాళ్లను బలితీసుకుంది. పికప్ ట్రక్, మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయంలో మినీ పికప్ వ్యాన్ లో ఏడుగురు ఉన్నారు. వారిలో నలుగురు మరణించగా, మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బెర్క్ షైర్ మెడికల్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదం షెఫీల్డ్ ఏరియాలోని పైక్ రోడ్ ఇంటర్ సెక్షన్ రూట్ 7 వద్ద జరిగినట్టు తెలుస్తోంది. మృతులు కనెక్టికట్ లోని న్యూ హావెన్ కు చెందినవారిగా భావిస్తున్నారు. కాగా, మృతుల పేర్లను పోలీసులు ఇంకా ప్రకటించలేదు.

More Telugu News