Telugudesam: ఉత్తరాంధ్ర సమస్యలపై 28 నుంచి టీడీపీ పోరు బాట

  • నిరసనల కోసం ఆరు బృందాల ఏర్పాటు
  • సీనియర్ నాయకులు సహా మూడు జిల్లాల నాయకులకు బృందాల్లో చోటు
  • 28న రుషికొండపై నిరసనతో ప్రారంభం
TDP Ready to Protest against north andhra issues

ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలియజేయనుంది. ఈ మేరకు పార్టీ ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. నిరసనలు తెలియజేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కమిటీల్లో సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిమిడి కళావెంకటరావుతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల నాయకులు ఉంటారని వెంకన్న తెలిపారు. 

నిరసన పోరు ఇలా..
* ఈ నెల 28న టీడీపీ నాయకుల బృందం రుషికొండపై విధ్వంసాన్ని పరిశీలించి నిరసన తెలుపుతుంది
* 29న దసపల్లా భూముల వద్ద నిరసన 
* 30న ఏజెన్సీలో గంజాయి సాగు, అమ్మకాలకు వ్యతిరేకంగా అరకులోయలో నిరసన
* 31న ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పాడేరులో నిరసన
* నవంబరు 1న చక్కెర కర్మాగారాల మూసివేతకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నిరసన కార్యక్రమం
* నవంబరు 3న సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై హిరమండలం సమీపంలోని గొట్టా బ్యారేజ్ వద్ద నిరసన

More Telugu News