ATM: ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2 వేలు బయటికొస్తున్న వైనం... సిద్ధిపేటలో ఎగబడిన ప్రజలు!

  • బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద రద్దీ
  • బ్యాంకు అధికారులకు సమాచారం
  • ఏటీఎంను మూసివేసిన అధికారులు
ATM malfunction in Siddipet

సిద్ధిపేటలో ఓ ఏటీఎం వద్దకు ప్రజలు పోటెత్తారు. అందుకు తగిన కారణమే ఉంది. ఆ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే, రూ.2 వేలు బయటికొస్తున్నాయట. ఈ వార్త కొద్దిసమయంలోనే సిద్ధిపేట మొత్తం పాకిపోయింది. దాంతో ఆ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. అది బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)కి చెందిన ఏటీఎం అని తెలిసింది.

ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటికొస్తోందన్న నేపథ్యంలో, బ్యాంకు అధికారులకు ఈ సమాచారం అందింది. వెంటనే స్పందించిన బీవోఐ అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. అధికారులు ఆ ఏటీఎంను పరిశీలిస్తున్నారు. ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు.

More Telugu News