వివేకా హత్య మా కుటుంబంలో జరిగిన ఘోరం: వైఎస్ షర్మిల
- తన చిన్నాన్నను ఎవరు హత్య చేశారో తెలియాలన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు
- ఈ కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని వ్యాఖ్య
- సునీతా రెడ్డికి న్యాయం జరగాలన్న షర్మిల
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య కేసు విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హ్యత్య చేశారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా హత్య వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది సీబీఐ దర్యాప్తులో తేలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును ఎవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదని షర్మిల స్పష్టం చేశారు.