Sensex: వరుసగా ఐదో రోజూ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 96 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతం వరకు నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. వరుసగా ఐదో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 59,203కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 17,564 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.27%), టెక్ మహీంద్రా (2.14%), ఎన్టీపీసీ (1.89%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.55%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.71%), ఏసియన్ పెయింట్స్ (-2.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.41%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.66%), టైటాన్ (-0.56%).
Sensex
Nifty
Stock Market

More Telugu News