గుంటూరులో పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణ హత్య
- గత రాత్రి 8 గంటల సమయంలో ఘటన
- కత్తులు, వేటకొడవళ్లతో వెంటాడి మరీ దారుణం
- బాధితుడు ఓ హత్యకేసులో నిందితుడు
బాధితుడిని నల్లచెరువు ఆరో లైన్కు చెందిన 38 ఏళ్ల దొడ్డి రమేశ్గా గుర్తించారు. రమేశ్ ఫైనాన్స్ వ్యాపారంతోపాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తుంటాడు. హత్యకు ముందు రమేశ్ ఇంట్లోనే ఉన్నాడని, స్నానానికి వెళ్లేందుకు రెడీ అవగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడని రమేశ్ తల్లి తెలిపారు.
రమేశ్ ఓ హత్యకేసులో నిందితుడని, అతడిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీ షీటర్ ఆర్కే హత్య చేశాడని రమేశ్ భార్య లత ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.