TRS: ఆ 8 గుర్తులను తొలగించండి...ఈసీకి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వినతి

  • మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన 8 గుర్తులు
  • వాటిని జాబితా నుంచి తొలగించాలంటున్న టీఆర్ఎస్
  • ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన వైనం
  • తాజాగా ఈసీ అధికారులను స్వయంగా కలిసిన వినోద్ కుమార్
trs leader vinod kumar meets ec officials on free symbols looks like car

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను తొలగించే దిశగా ఆ పార్టీ చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో తాము కలగజేసుకోలేమంటూ హైకోర్టు చెప్పడంతో తాజాగా టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది.

టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచిన విషయాన్ని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్థికి నష్టం జరుగుతుందని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కారును పోలిన ఆ 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.

More Telugu News