కోడితో పాటు మ‌ద్యం పంచిన టీఆర్ఎస్ నేత‌కు ఈసీ నోటీసులు

ecnotices to trs leader rajanala srihari over liquor distribution to public
  • ద‌స‌రా రోజున పేద‌ల‌కు కోడి, మ‌ద్యం పంపిణీ చేసిన శ్రీహ‌రి
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
  • ఘ‌ట‌న‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత‌లు
  • వివ‌రాలు తెల‌పాలంటూ వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్‌కు ఈసీ ఆదేశం
  • ఈసీ త‌ర‌ఫున శ్రీహ‌రికి నోటీసులు అంద‌జేసిన క‌లెక్ట‌ర్‌
టీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశ‌పెడుతూ పార్టీ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా... స‌రిగ్గా ద‌స‌రా ప‌ర్వ‌దినాన‌ వ‌రంగ‌ల్‌కు చెందిన ఆ పార్టీ నేత రాజ‌నాల శ్రీహ‌రి పేద‌ల‌కు కోడితో పాటు క్వార్ట‌ర్ మ‌ద్యం బాటిల్ పంపిణీ చేసిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలో బ‌హిరంగంగా జ‌రిగిన ఈ పంపిణీకి సంబంధించిన వీడియో నాడు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. 

రాజ‌నాల శ్రీహ‌రి బ‌హిరంగంగా మ‌ద్యం పంపిణీ చేసిన వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ఎన్నిక‌ల సంఘం గురువారం వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను వివ‌ర‌ణ కోరింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు అంద‌జేయాలంటూ క‌లెక్ట‌ర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల‌ను ఆధారం చేసుకుని జిల్లా క‌లెక్ట‌ర్‌.. రాజ‌నాల శ్రీహ‌రికి నోటీసులు జారీ చేశారు. ఓట‌ర్ల‌కు కోడితో పాటు మద్యం పంపిణీని ఎందుకు చేప‌ట్టార‌ని స‌ద‌రు నోటీసుల్లో శ్రీహ‌రిని క‌లెక్ట‌ర్ వివ‌ర‌ణ కోరారు.
Go Back to Shorts
TRS
BRS
Telangana
KCR
Warangal
Election Commission
Rajanala Srihari

More Telugu News