ఆకలేస్తోందని సమోసా కొంటే.. కొరకగానే కాగితం కనిపించింది: క్షమించమన్న ఐఆర్సీటీసీ
- ముంబై-లక్నో రైలులో ఘటన
- సమోసాను ట్వీట్ చేసిన ప్రయాణికుడు
- రైల్వే సేవలు అధ్వానంగా తయారవుతున్నాయంటూ నెటిజన్ల పైర్
దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రైల్వే వ్యవస్థ రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోందంటూ విరుచుకుపడ్డారు. టికెట్ కన్ఫర్మేషన్ సహా పలు అంశాల్లో రైల్వే వ్యవస్థ మరీ తీసికట్టుగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తున్నా సేవలు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయని విమర్శలు గుప్పించారు. దీంతో స్పందించిన ఐఆర్సీటీసీ అజి కుమార్ను క్షమించమని వేడుకుంది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, మీ పీఎన్ఆర్, మొబైల్ నంబరును డీఎంలో షేర్ చేయాలని కోరింది. ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.