TDP: ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా గాడు చిన్ని కుమారి ల‌క్ష్మీ

  • చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ప్ర‌క‌ట‌న విడుదల చేసిన అచ్చెన్న‌
  • జీవీఎంసీ కార్పొరేట‌ర్‌గా కొన‌సాగుతున్న చిన్ని కుమారి ల‌క్ష్మీ
  • గ‌తంలో భీమిలి మునిసిపల్ చైర్ ప‌ర్స‌న్‌గా ప‌నిచేసిన మ‌హిళా నేత‌
tdp announces gadu chilnni lakshmi kumari as its north andhra graduates mlc candidate

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి విప‌క్ష టీడీపీ శుక్ర‌వారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మ పార్టీ అభ్య‌ర్థిగా గాడు చిన్ని కుమారి ల‌క్ష్మీ పోటీ చేయ‌నున్న‌ట్లు టీడీపీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ ఏపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆదేశాల మేర‌కే చిన్ని కుమారి ల‌క్ష్మీ అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో అచ్చెన్న పేర్కొన్నారు. ప్ర‌స్తుతం గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) రెండో వార్డు కార్పొరేట‌ర్‌గా చిన్ని కుమారి ల‌క్ష్మీ కొన‌సాగుతున్నారు. గ‌తంలో భీమిలి మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌గానూ ఆమె ప‌నిచేశారు.
.

More Telugu News