ఏపీ భవన్లో అధికారిని హరీశ్ రావు ఎలా తన్నారో అందరూ చూశారు: ఏపీ మంత్రి అమర్నాథ్
- 8 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారన్న అమర్నాథ్
- హరీశ్, కేసీఆర్ల మధ్య గొడవలు ఉంటే వాళ్లే చూసుకోవాలని వ్యాఖ్య
- ఏపీపై తెలంగాణ నేతల విమర్శలు సరికాదని హితవు
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర మంత్రి హరీశ్ రావులను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అమర్నాథ్ అన్నారు. గడచిన మూడేళ్లలోనే ఏపీకి తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసునని కూడా ఆయన అన్నారు. 8 ఏళ్లలో సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ భవన్లో అధికారిని హరీశ్ రావు ఎలా తన్నారో అందరూ చూశారని ఆయన ఎద్దేవా చేశారు. హరీశ్ రావు, కేసీఆర్ల మధ్య గొడవలు ఉంటే వాళ్లే చూసుకోవాలని కూడా అమర్నాథ్ వ్యాఖ్యానించారు.