Vikram: 'పొన్నియిన్ సెల్వన్' స్టార్స్ పారితోషికాలు ఇవేనంటూ చెన్నై టాక్!

  • రేపు విడుదలవుతున్న 'పొన్నియిన్ సెల్వన్'
  • మణిరత్నం కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ ఇది
  • విక్రమ్ 12 కోట్లు .. ఐశ్వర్య రాయ్ 10 కోట్లు?  
Ponniyan Selven Movie Update

మణిరత్నం తన కెరియర్లోనే తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథాంశాన్ని ఎంచుకున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. బడ్జెట్ పరంగా .. భారీ తారాగణం పరంగా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ నెల 30వ తేదీ కోసమే సినిమా ప్రేమికులంతా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎవరు ఎంత పారితోషికం అందుకున్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా విక్రమ్  తీసుకున్న మొత్తం ఎక్కువనా? లేదంటే ఆ ఐశ్వర్య రాయ్ అందుకున్నది ఎక్కువనా? అనేది తెలుసుకోవడానికి మరికొందరు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

ఈ సినిమా కోసం విక్రమ్ 12 కోట్లు .. ఐశ్వర్య రాయ్ 10 కోట్లు .. జయం రవి 8 కోట్లు .. కార్తి 5 కోట్లు .. త్రిష 2.5 కోట్లను అందుకున్నారనేది చెన్నై టాక్. జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఎవరి పాత్ర ఎక్కువ కనెక్ట్ అవుతుంది .. ఎవరి పాత్ర ఎక్కువ హైలైట్ అవుతుందనేది రేపు తేలనుంది.

More Telugu News