Telangana: సింగ‌రేణి కార్మికుల‌కు ద‌స‌రా కానుక ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌

  • సింగ‌రేణి లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు చెల్లింపు
  • ద‌స‌రా లోపుగా చెల్లింపులు పూర్తి కావాల‌న్న సీఎంఓ
  • సింగ‌రేణి కార్మికుల‌కు రూ.368 కోట్ల మేర అంద‌నున్న కానుక
  • గ‌తేడాది కంటే కార్మికులకు 1 శాతం పెరిగిన‌ లాభాల వాటా
ts cm kcr proposes 30 percent profit share to lavourers of singareni colleries company

సింగ‌రేణి కార్మికుల‌కు ద‌స‌రా పండుగ కానుక‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. సింగ‌రేణి సంస్థ లాభాల్లో 30 శాతాన్ని కార్మికుల‌కు పంచాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. ఈ మేర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం (సీఎంఓ) బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ లాభాల వాటాను కార్మికుల‌కు ద‌స‌రా పండుగ లోపుగానే అంద‌జేయాల‌ని కూడా కేసీఆర్ నిర్ణ‌యించారు. కేసీఆర్ ఆదేశాల‌తో సింగ‌రేణి సంస్థ‌కు సీఎంఓ ముఖ్య కార్య‌ద‌ర్శి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

సింగ‌రేణి లాభాల్లో 30 శాతం వాటా అంటే... ఈ ఏడాది కార్మికుల‌కు రూ.368 కోట్లు అంద‌నున్నాయి. సింగ‌రేణి సంస్థ లాభాల్లో వాటాను కార్మికుల‌కు ద‌స‌రా కానుక‌గా ఇస్తుండ‌టం ఈ సారి కొత్తేమీ కాకున్నా... గ‌తేడాది కంటే లాభాల వాటాను కేసీఆర్ సర్కారు 1 శాతం మేర పెంచింది. 2020లో సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను కార్మికుల‌కు ద‌స‌రా కానుకగా ఇవ్వ‌గా... 2021లో దానిని 29 శాతానికి పెంచారు. తాజాగా ఈ ఏడాది లాభాల్లో కార్మికుల వాటాను 30 శాతానికి పెంచారు.

More Telugu News