భారత్ జోడో యాత్రలో 'విలాసాల విడిది' ఆరోపణలపై సాక్ష్యంతో కూడిన కాంగ్రెస్ వివరణ ఇదిగో!
- భారత్ జోడో యాత్రలో విలాసాల విడిది అంటూ వైరి వర్గాల ఆరోపణ
- నేల మీదే పార్టీ శ్రేణులు విశ్రాంతి తీసుకుంటున్న వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
- వైరి వర్గాలు ఆరోపిస్తున్న విలాసాలు ఇవేనంటూ దెప్పిపొడుపు
ఈ విడిదిలో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణులంతా ఎవరికి వారుగా తమకు ఇచ్చిన పరుపులు పరచుకుని పడుకున్నారు. భారత్ జోడో యాత్రలో 5 స్టార్ విలాసాలు అంటూ వైరి వర్గాలు ఆరోపిస్తున్న విలాసాలతో కూడిన విడిది ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మనీష్ కందూరి తెలిపారు.