Prime Minister: 1,213 మ‌ట్టి టీ క‌ప్పులతో మోదీ సైక‌త శిల్పం... సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ వీడియో ఇదిగో

  • నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌ర్త్ డే
  • సైక‌త శిల్పంతో మోదీకి విషెస్ చెప్పిన సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్‌
  • పూరీ తీరంలో భారీ సైక‌త శిల్పాన్ని ఆవిష్క‌రించిన సైక‌త శిల్పి
Sudarsan Pattnaik wishes pm modi with sand art

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శ‌నివారం ఆయ‌న‌కు దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఏ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్లుగా అదే త‌ర‌హా సైక‌త శిల్పంతో దేశ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ఒడిశాకు చెందిన సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ కూడా ప్ర‌ధానికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అది కూడా త‌న సైక‌త శిల్పాల స్టైల్లోనే. దానికి సంబంధించిన వీడియోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పూరీ న‌గ‌రం స‌మీపాన సాగ‌ర‌ తీరంలో ఇసుక‌తో మోదీ ముఖాన్ని తీర్చిదిద్దిన సుద‌ర్శ‌న్‌... ఆ ముఖం చుట్టూ... ఏకంగా 1,213 మ‌ట్టితో త‌యారు చేసిన టీ క‌ప్పుల‌ను ఏర్పాటు చేసి ఓ ఫ్రేమ్ లాంటి నిర్మాణాన్ని క‌ట్టేశారు. మోదీ ముఖానికి ముందు హ్యాపీ బ‌ర్త్‌డే మోదీజీ అని కూడా ఆయ‌న రాశారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

More Telugu News