గుజరాత్లోనూ 'పెన్షన్ స్కీం' ఆందోళనలు.. స్తంభించిన ప్రభుత్వ సేవలు
- సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ సామూహిక సెలవు పెట్టిన గుజరాత్ ఉద్యోగులు
- శనివారం తెరచుకోని ప్రభుత్వ కార్యాలయాలు
- రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు
ఈ ఆందోళనల్లో భాగంగా శనివారం గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులంతా శనివారం సామూహిక సెలవు పెట్టి విధులు బహిష్కరించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తెరచుకోలేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సేవలు స్తంభించిపోయాయి.