Telangana: తెలంగాణలో తాజాగా 111 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 10,346 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 47 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 128 మంది
  • ఇంకా 775 మందికి చికిత్స
Telangana corona stats

తెలంగాణలో గత 24 గంటల్లో 10,346 శాంపిల్స్ పరీక్షించగా, 111 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంకా 300 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 128 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,36,522 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 8,31,636 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 775 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మరణించారు

More Telugu News