Kolagatla Veerabhadra Swamy: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేసిన నేపథ్యంలో, ఎన్నిక జరగనుంది. ఈ ఉదయమే నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ పదవికి వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి ఈ సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్లకు ఈ సాయంత్రం వరకు గడువు ఉంది.
కాగా, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ పదవికి టీడీపీ నుంచి పోటీ ఉండదని తెలుస్తోంది. దాంతో కోలగట్ల ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే, కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ హైకమాండ్ కోరినట్టు సమాచారం.
కాగా, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది. ఈ పదవికి టీడీపీ నుంచి పోటీ ఉండదని తెలుస్తోంది. దాంతో కోలగట్ల ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే, కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ హైకమాండ్ కోరినట్టు సమాచారం.