ఈ నెల 20న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం... రేపు ప్రత్యేక ప్రవేశ టికెట్ల విడుదల
- ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు
- ముందుగా ఆలయ శుద్ధి
- ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ప్రతి ఏడాది నాలుగు పర్యాయాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట చేపట్టే ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.