South Central Railway: నేటి నుంచి ఐదు రోజులపాటు విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు

  • నిర్వహణ పనులు జరుగుతుండడంతో తాత్కాలికంగా రైళ్ల రద్దు
  • రద్దయిన రైళ్లలో విజయవాడ, కాకినాడ, విశాఖపట్టణం నుంచి నడిచే రైళ్లు
  • గుంటూరు-మాచర్ల మధ్య నడిచే రైలు గుంటూరు-నడికుడి మధ్య రద్దు
Few Trains Cancelled due to maintenance work in AP

నేటి నుంచి ఈ నెల 20 వరకు విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267/17268), కాకినాడ-విజయవాడ (17257/17258), విజయవాడ-గుంటూరు (07783), గుంటూరు-తెనాలి (07887), విజయవాడ-గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి-గుంటూరు (07282), గుంటూరు-విజయవాడ (07864), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465), తెనాలి-రేపల్లె (07888), రేపల్లె-మార్కాపురం (07889), మార్కాపురం-తెనాలి (07890), తెనాలి-విజయవాడ(07630) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

గుంటూరు-మాచర్ల (07779/07780) మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ-మాచర్ల (07781/07782) రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య రద్దు చేశారు.

More Telugu News