Andhra Pradesh: రేప‌టి నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు... తొలి రోజే 3 రాజ‌ధానుల‌పై చర్చ?

  • ఉద‌యం 9 గంట‌ల‌కు అసెంబ్లీ ప్రారంభం
  • 10 గంట‌ల‌కు ప్రారంభం కానున్న మండ‌లి స‌మావేశాలు
  • 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఉభ‌య స‌భ‌లు
AP Assembly sessions will start from tomorrow

ఏపీ శాస‌న స‌భా స‌మావేశాలు రేపు (గురువారం) ప్రారంభం కానున్నాయి. గురువారం ఉద‌యం 9 గంట‌లకు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా... శాస‌న మండ‌లి సమావేశాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఈ స‌మావేశాల్లో భాగంగా రేపు తొలి రోజే 3 రాజ‌ధానుల‌కు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు.. దానిపై చర్చతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించనున్నట్టు సమాచారం. 3 రాజ‌ధానుల‌పై ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లుగా వైసీపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News