సజ్జల కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల అప్పగింత
- సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడే భార్గవ రెడ్డి
- వైసీపీ మీడియా వింగ్ బాధ్యతల్లో ఉన్న భార్గవ రెడ్డి
- తాజాగా పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలూ అప్పగింత
2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా మారిపోయాయి. ప్రతి చిన్న అంశంపైనా స్పందిస్తున్న ఈ పార్టీలు వైసీపీకి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియాను కూడా మరింత యాక్టివేట్ చేయాలని భావించిన జగన్.. ఆ వింగ్కు బార్గవ రెడ్డిని చీఫ్గా నియమించారు. భార్గవ రెడ్డి ప్రస్తుతం వైసీపీ మీడియా వింగ్ను పర్యవేక్షిస్తున్నారు.