Depression: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం ... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఏపీలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు
  • తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
  • రాగల 24 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం
Depression in Bay Of Bengal

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతుందని వెల్లడించింది. 

అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

More Telugu News