బెజవాడలో వెంకయ్యతో ఆత్మీయ సమావేశం... హాజరైన 3 పార్టీల కీలక నేతలు
- వెంకయ్య మిత్రుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం
- హాజరైన కేశినేని నాని, దేవినేని అవినాశ్, కామినేని శ్రీనివాస్
- ఈ సమావేశం తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందన్న వెంకయ్య
ఈ సమావేశంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు... పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక వెంకయ్యతో ఇప్పటికే రాజమహేంద్రవరం, గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.