AP Govt: ఏపీ ప్రభుత్వానికి టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం

  • ఏపీకి జాతీయస్థాయిలో అవార్డులు
  • తాజాగా మరో పురస్కారం
  • నీతి ఆయోగ్ సలహాదారు నేతృత్వంలో జ్యూరీ
  • పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధి విభాగంలో అవార్డు
TOI Group award for AP Govt

గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం జాతీయస్థాయిలో పలు అవార్డులు అందుకుంటోంది. తాజాగా, ఏపీ ప్రభుత్వాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు వరించింది. పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ఈ అవార్డు ఏపీకి లభించింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు.జె.సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఈ పురస్కారానికి ఏపీని ఎంపిక చేసింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల విభాగంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ అవార్డును ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అందుకోనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్, పోలీసింగ్ విభాగాల్లో ఏపీకి ఇప్పటికే అవార్డులు దక్కడం తెలిసిందే.

  • Loading...

More Telugu News