Rahul Gandhi: రాహుల్ యాత్ర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 118 మందితో భార‌త్ యాత్రిక్ బృందం ఏర్పాటు

  • బృందంలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
  • ఏపీ నుంచి ఒక్క‌రికి మాత్ర‌మే ద‌క్కిన చోటు
  • నేటి సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రారంభం కానున్న రాహుల్ యాత్ర‌
congress constitutes bharat yatrik team with 118 members to organise rahul  yatra

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్ట‌నున్న భార‌త్ జోడో యాత్ర మ‌రికాసేప‌ట్లోనే ప్రారంభం కానుంది. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు క‌న్యాకుమారిలో ప్రారంభం కానున్న ఈ యాత్ర దాదాపుగా 150 రోజుల పాటు 3,570 కిలోమీట‌ర్ల మేర సాగి క‌శ్మీర్ చేరుకుంటుంది. 

ఇంత‌టి భారీ యాత్ర‌ను ప‌క‌డ్బందీగా కొన‌సాగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. భార‌త్ యాత్రిక్ పేరిట 118 మందితో ఆ పార్టీ ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు ద‌క్క‌గా... ఏపీ నుంచి మాత్రం ఒక్క‌రికే అవ‌కాశం ద‌క్కింది. ఈ బృందం పాద‌యాత్ర ఆద్యంతం రాహుల్ వెన్నంటే సాగ‌నుంది.

More Telugu News