రావిరాల భూ నిర్వాసితుల కోసం 72 గంటల దీక్షకు దిగనున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- బండరావిరాల, చిన్న రావిరాలలో భూమిని కోల్పోయిన రైతులు
- పరిహారం విషయంలో రైతులకు మద్దతుగా నిలిచిన కోమటిరెడ్డి
- పరిహారం విషయంలో ద్వంద్వ ప్రమాణాలపై కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఓ దఫా నడిరోడ్డుపై బైఠాయించి వెంకట్ రెడ్డి నిరసన తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతుల పక్షాన 72 గంటల దీక్షకు దిగేందుకు ఆయన సన్నద్ధమయ్యారు. భూమి కోల్పోయిన రైతులకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పరిహారం ఇస్తున్న వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన భూమిని కోల్పోయిన రైతులకు అంతకు తగ్గట్లుగానే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు.