చైనాలో భూకంపం... 30 మంది మృతి
- నైరుతిభాగంలో తీవ్ర ప్రకంపనలు
- రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రత నమోదు
- కాంగ్ డింగ్ నగరానికి 43 కిమీ దూరంలో భూకంప కేంద్రం
- 10 వేల మందిపై ప్రభావం
కాగా, కరోనా ప్రభావంతో ఇప్పటికీ లాక్ డౌన్ లో ఉన్న చెంగ్డు నగరంలోనూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావంతో 10 వేల మంది ప్రభావితులయ్యారని చైనా ప్రభుత్వ టీవీ చానల్ పేర్కొంది. పలు ప్రాంతాల్లో బండరాళ్లు దొర్లిపడడంతో రహదారులు మూసుకుపోయాయి. టెలీకమ్యూనికేషన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది.