Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం

  • అహ్మదాబాద్ నుంచి ముంబయి వస్తున్న మిస్త్రీ
  • చరోటీ వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు
  • తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచిన మిస్త్రీ
  • డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలు
Tata Sons former chairman Cyrus Mistry died in road mishap

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్ ను గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన పాల్ఘాట్ ప్రాంతంలోని చరోటీ వద్ద సూర్యా నది వంతెనకు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని గుజరాత్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ దుర్మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.
.

More Telugu News