Encounter: జమ్మూ కశ్మీర్లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం

  • షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్
  • ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ
  • నాగ్బల్ ప్రాంతంలో ఘటన
Two LeT terrorists killed in Jammu Kashmir

జమ్మూ కశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. నాగ్బల్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నేడు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాయి. 

ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. భద్రతా దళాలు కూడా దీటుగా స్పందించడంతో, ఇద్దరు ఉగ్రవాదులు నేలకొరిగారు. నాగ్బల్ ప్రాంతానికి అదనపు బలగాలను కూడా రప్పించారు. ప్రస్తుతం అక్కడ మరింత తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News