రేపే రిలయన్స్ ఏజీఎం... అందరి దృష్టి ముఖేశ్ అంబానీ ప్రసంగంపైనే
- రేపు రిలయన్స్ 45వ ఏజీఎం
- ముంబై వేదికగా వాటాదారులతో ముఖేశ్ సమావేశం
- 5జీ సేవలపై ముఖేశ్ కీలక ప్రకటన చేసే అవకాశం
ఈ క్రమంలో రేపు జరగనున్న రిలయన్స్ 45వ ఏజీఎంపై అందరి దృష్టి పడింది. ప్రత్యేకించి ఏజీఎంలో ముఖేశ్ అంబానీ ఎలాంటి వ్యూహాలు ప్రకటిస్తారన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టెలికాం రంగంలో మేటిగా నిలవాలన్న లక్ష్యంతో సాగుతున్న రిలయన్స్.. 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లుగా సమాచారం. అదే తరహాలో కొత్త రంగాల్లోకి రిలయన్స్ ప్రవేశంపైనా ముఖేశ్ కీలక ప్రకటనలు చేయవచ్చన్న వాదనలు వినిసిస్తున్నాయి.