Vijay Devarakonda: అందరి దృష్టి పూరి 'జన గణ మన' పైనే!

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'లైగర్'
  • తొలి ఆటతోనే వచ్చిన నెగెటివ్ టాక్ 
  • ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన 'జన గణ మన'
  • ఈ ప్రాజెక్టు పైనే అందరిలో పెరుగుతున్న ఆసక్తి 
Jana Gana Mana Movie Update

పూరి జగన్నాథ్ కలల ప్రాజెక్టు 'జన గణ మన'. ఈ టైటిల్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా కాలం క్రితమే కథను రెడీ చేసుకున్నాడు. ఈ కథ మహేశ్ బాబుకి సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో ఆయనకి వినిపించాడు. అప్పటికే పూరితో 'పోకిరి' .. 'బిజినెస్ మెన్' వంటి రెండు హిట్లు మహేశ్ బాబు ఖాతాలో ఉన్నాయి. 

అందువలన సహజంగానే ఆయన పూరితో ఈ మూడో ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన మహేశ్ ఆ ప్రాజెక్టును సున్నితంగా తిరస్కరించాడు. అదే కథతో విజయ్ దేవరకొండను ఒప్పించిన పూరి, ఇటీవలే ఫస్టు షెడ్యూల్ షూటింగును కూడా పూర్తిచేశాడు.

'పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తాజాగా వచ్చిన 'లైగర్' అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో ఆ తరువాత సినిమా అయిన' జన గణ మన' గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో  పూరి - విజయ్ ముందుకు వెళతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Telugu News