TDP: అనంత‌పురంలో భారీ భూ దందా... ముగ్గురు విలేక‌రుల అరెస్ట్

  • 14.96 ఎక‌రాల భూమిని విక్ర‌యించిన విలేక‌రులు
  • రూ.14 కోట్ల‌కు డీల్ కుద‌ర‌గా రూ.75 ల‌క్ష‌లు చేతులు మారాయ‌న్న టీడీపీ
  • ముగ్గురు విలేక‌రులు, ఓ డ్రైవ‌ర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుల‌కు రిమాండ్ విధించిన స్థానిక కోర్టు

ఏపీలోని అనంత‌పురం జిల్లాలో ఓ భారీ అక్ర‌మ భూ దందా వెలుగు చూసింది. ఈ దందాలో అంతా తామై వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు విలేక‌రుల‌తో పాటుగా ఓ డ్రైవ‌ర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని బుధ‌వారం స్థానిక కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఈ న‌లుగురికి న్యాయ‌మూర్తి రిమాండ్ విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ త‌న అధికారిక సోష‌ల్ మీడియాల వేదిక‌గా వ‌రుస ట్వీట్ల‌ను పోస్ట్ చేసింది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... అనంతపురంలో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి 14.96 ఎకరాల భూమిని దాని య‌జ‌మానికి తెలియ‌కుండా మరొకరికి విక్రయించిన విలేక‌రులు భూమిని కొనుగోలుదారుడి పేరిట‌ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ కేసు విషయమై పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక ఎన్టీవీ మరియు సాక్షి విలేఖర్లే సూత్రధారులు అన్నవిషయం తేలిందని టీడీపీ ఆరోపించింది. ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే  రూ.75 లక్షలు చేతులు మారాయ‌ని కూడా ఆ పార్టీ తెలిపింది.

More Telugu News