ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ఈడీ కేసు నమోదు
- ఎక్సైజ్ పాలసీతో సిసోడియా అక్రమంగా సంపాదించారన్న సీబీఐ
- సీబీఐ కేసు ఆధారంగా మనీ ల్యాండరింగ్ ఆరోపణల కింద ఈడీ కేసు
- ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనన్న ఆప్
సీబీఐ దాఖలు చేసిన కేసును పరిశీలించిన ఈడీ అధికారులు మంగళవారం సిసోడియాపై కేసు నమోదు చేశారు. అయితే ఎక్సైజ్ పాలసీతో అక్రమంగా సంపాదించారంటూ సీబీఐ కేసు దాఖలు చేయగా... ఈడీ మాత్రం మనీ ల్యాండరింగ్కు సిసోడియా పాల్పడ్డారంటూ కేసు దాఖలు చేయడం గమనార్హం. మరోపక్క, సిసోడియాపై రాజకీయ కారణాలతోనే సీబీఐ, ఈడీల చేత బీజేపీ సర్కారు కేసులు నమోదు చేయిస్తోందని ఆప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఏ తరహా విచారణకైనా తాను సిద్ధమేనని సిసోడియా కూడా స్వయంగా ప్రకటించారు.