Vallabhaneni Vamsi: గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కాల ఆరోప‌ణ‌ల‌పై గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు

  • వంశీ గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కాల‌కు పాల్పడుతున్నారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌
  • విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు
  • కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు గ‌నుల శాఖ‌కూ నోటీసుల జారీ
  • త‌దుప‌రి విచార‌ణ 8 వారాల‌కు వాయిదా
ap high court issues notices to gannavarammla vallabhaneni vamsi mohan

ఎన్టీఆర్ జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ గ‌నుల అక్ర‌మ తవ్వ‌కాల‌కు పాల్ప‌డుతున్నారంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీకరించిన హైకోర్టు... ఈ పిటిష‌న్ ఆధారంగానే ఆయనకు నోటీసులు జారీ చేసింది. వంశీతో పాటు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, గ‌నుల శాఖ అధికారుల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను హైకోర్టు 8 వారాల‌కు వాయిదా వేసింది. 

 

More Telugu News