హైదరాబాద్ నుంచి వెళ్తూ కరాచీలో ల్యాండైన విమానం.. నెల రోజుల్లో మూడోసారి!
- మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలో ల్యాండైన విమానం
- గత నెలలో స్పైస్జెట్, ఇండిగో విమానాల అత్యవసర ల్యాండింగ్
- ఆ విమానంతో భారత్కు ఎలాంటి సంబంధమూ లేదన్న సివిల్ ఏవియేషన్
జులై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానం అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగా, అదే నెల 17న షార్జా-హైదరాబాద్ విమానం ఇంజిన్లో లోపాన్ని గుర్తించిన పైలట్ కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. కాగా, చార్టర్డ్ విమానం కరాచీలో దిగిన విషయాన్ని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) నిర్ధారించింది. అంతర్జాతీయ చార్టర్డ్ విమానం ఇండియా నుంచి టేకాఫ్ అయిందని, అయితే ఆ విమానంతో అంతకుమించి సంబంధం లేదని పేర్కొంది.