తిరుమల క్షేత్రంలో మరోసారి భక్తుల తాకిడి
- ఇటీవల కాస్త తగ్గిన భక్తుల రద్దీ
- ప్రస్తుతం సెలవులు, శ్రావణమాసంలో మళ్లీ పెరిగిన రద్దీ
- సర్వదర్శనానికి 15 గంటల సమయం
- నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం
కాగా, తమిళులకు పవిత్రమైనది పెరటాసి మాసం. దాంతో తమిళనాడు నుంచి మరింత మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈసారి భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.