Vijay: మళ్లీ ఇంతకాలానికి విజయ్ జోడీ కడుతున్న త్రిష !

  • తెలుగులో తగ్గిన త్రిష జోరు 
  • తమిళంలో మాత్రం తగ్గని అవకాశాలు 
  • నాయిక ప్రధానమైన సినిమాలతో బిజీ
  • లోకేశ్ కనగరాజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  త్రిష  
Trisha in Vijay Movie

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా త్రిష తన జోరు చూపించింది. తెలుగులో 'నాయకి' తరువాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. తమిళంలో నాయిక ప్రధానమైన సినిమాలతో బిజీగానే ఉంది. మణిరత్నం భారీ ప్రాజెక్టులోను మంచి పాత్రను దక్కించుకుంది. ఈ సినిమా సీక్వెల్ లోను ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. 

తాజాగా విజయ్ సినిమా కోసం ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 'వారసుడు' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. 'మాస్టర్' తరువాత విజయ్ తో లోకేశ్ చేస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం త్రిషను తీసుకున్నారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు .. నాలుగు సినిమాలు వచ్చాయి. 2008లో వచ్చిన 'కురువి' తరువాత ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అంటే 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇద్దరూ జోడీ కడుతున్నారన్నమాట. తెలుగులో గ్యాప్ వచ్చినా త్రిష పట్ల ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి.

More Telugu News