మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల: నారా లోకేశ్
- సత్యసాయి జిల్లాలో మహిళపై ముగ్గురు అత్యాచారం చేశారన్న లోకేశ్
- పోలీసులు తగాదా కేసు పెట్టి, చేతులు దులుపుకున్నారని విమర్శ
- బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్
స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారని ఆయన అన్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.