దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. మళ్లీ 20 వేల చేరువలో కేసులు
- గత 24 గంటల్లో19,406 పాజిటివ్ కేసులు నమోదు
- దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,34,793
- వైరస్ వల్ల తాజాగా 38 మంది మృతి
దేశ వ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారిలో 4,34,65,552 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. కరోనా వల్ల ఇప్పటిదాకా 5,26, 649 మంది మృది చెందారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,05,92,20,794 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 32,73,551 మందికి వ్యాక్సిన్ అందించారు.