Yogi Adityanath: రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూపీ సీఎం యోగి

  • ఈ నెల 11న రక్షాబంధన్ వేడుక
  • 48 గంటల పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ మహిళలకు యోగి ఆఫర్
  • అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీకి ఆదేశాలు
Yogi Adityanaths bumper offer to women on the occasion of Rakshabandhan

సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక రక్షాబంధన్. ఈ నెల 11న దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ ను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా యూపీలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ బహుమతిని ప్రకటించారు. రెండు రోజుల పాటు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటన చేశారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఆ రెండు రోజుల పాటు మహిళలు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని యూపీ ఆర్టీసీని ఆదేశించారు. ఈ మేరకు సీఎం యోగి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

More Telugu News