ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
- ఢిల్లీ పర్యటనలో దీదీ
- ప్రధానితో భేటీ అయిన వైనం
- పార్థ చటర్జీ అరెస్ట్ నేపథ్యంలో భేటీపై ఆసక్తి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ వర్సెస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన జగదీప్ ధన్కర్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి ముందు కూడా ప్రధానితో దీదీ భేటీ అయ్యారు. తాజాగా ప్రధానితో మమత భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.