అనకాపల్లి జిల్లాలో విష వాయువు లీక్... 50 మంది మహిళలకు అస్వస్థత
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘటన
- వాంతులు, విరేచనాలతో స్పృహ తప్పిన మహిళా ఉద్యోగులు
- బాధితులను ఆసుపత్రులకు తరలించిన యాజమాన్యం
ప్రాథమిక సమాచారం ప్రకారం 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. విష వాయువును పీల్చిన కారణంగా వీరంతా వాంతులు, విరేచనాలకు గురై స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటీన ఆసుపత్రులకు తరలించింది.