శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. టీపీసీసీ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి
- విమానాశ్రయం నుంచి వస్తుండగా బోల్తాపడిన కారు
- అక్కడికక్కడే మృతి చెందిన తానియా
- తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
- పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహం
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.