Telangana: తెలంగాణలో తాజాగా 851 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 38,024 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 327 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 652 మంది 
  • ఇంకా 5,369 మందికి చికిత్స
Telangana corona details

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,024 కరోనా పరీక్షలు నిర్వహించగా, 851 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంకా 570 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. హైదరాబాదులో అత్యధికంగా 327 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 65, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,19,141 మంది కరోనా బారినపడగా, వారిలో 8,09,661 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,369 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

More Telugu News