రేపటి నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల రద్దు... తిరిగి ఈ నెల 25 నుంచి మొదలు
- పరీక్షల వాయిదాకు కారణాలు వెల్లడించని ఎన్టీఏ
- పరీక్షకు ఒక రోజు ముందుగా వాయిదా ప్రకటన
- రేపటి నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్న ఎన్టీఏ
ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను గురువారం నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించిన ఎన్టీఏ.. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.